సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళుతున్న ప్యాసింజర్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు మహిళల మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. మంచిర్యాల జిల్లా మందమర్రి-రవీంద్రఖని మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలను ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు దొరకలేదు. రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post