telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈటల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తెలంగాణపై చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ నుంచి మాట్లాడేందుకు ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది.

తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, కేసీఆర్‌ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతి, తెలంగాణ ఉద్యమం అంశాలను ఈటల ప్రస్తావించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ, జేపీ నడ్డా అభినందించారు.

ఈటల తర్వాత కిషన్‌రెడ్డి, డీకే అరుణ మాట్లాడారు.కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశ పెట్టారు.

Related posts