గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు సజీవదహనం అయ్యారు. తల్లి యశోద, కొడుకు రాహుల్ రాత్రి వంట గదిలో పడుకున్నారు.
కాగా అర్ధరాత్రి సమయంలో వంట గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల బస్ టికెట్లపై “జెరూసలెం”.. స్వరూపానంద ఫైర్