telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆందోళనల పేరుతో చంద్రబాబు డ్రామాలు: మంత్రి శంకర్ నారాయణ

shanker narayana

మాజీ సీఎం చంద్రబాబుపై పీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భూములను కాపాడుకునేందుకే ఆందోళనలపేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఏ ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా సమర్థిస్తూంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, అతని సంబంధీకులు బినామీ పేర్లతో భూములు కొన్నారని విమర్శించారు. ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుతూ టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూంటే, రాయల సీమ టీడీపీ నేతలు మాత్రం అమరావతినే సదా వల్లిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

Related posts