ఏపీ బడ్జెట్ పై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. ఇచ్చిన వాగ్ధానాలకు, బడ్జెట్కు పొంతన లేదని తప్పుబట్టారు.
సంక్షేమ పథకాలకు అరకొర నిధులు ఇచ్చారని అన్నారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఊసేలేదని, బీమా పథకాన్ని రూ. లక్షకు కుదించారని అనరు. .ఇరిగేషన్ శాఖకు రూ.1000 కోట్లు నిధులు తగ్గించారని ఆరోపించారు.