ప్రెగ్నెన్సీ టైమ్లో ప్రతి మహిళ ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా. ఈ టైమ్లో డాక్టర్స్ ఐరెన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమంటారు. గర్భిణి తీసుకున్న ప్రతి ఆహారం కూడా తనకి పుట్టబోయే బిడ్డకి ఉపయోగం. గర్భిణీలు వారితో పాటు వారి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా చూసుకోవాలి.
గర్భావధికాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువును బిడ్డ పొందుతుంది.పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ప్రతి మహిళ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని వల్లే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉంటుందని కలలు కంటుంది.
అయితే గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అవసరం? అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. వీలైనంత వరకు శక్తి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దీని వల్ల శిశువు ఎదుగుదల బాగా ఉంటుది. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి.
ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు బ్రోకలీ, క్యారెట్లు, క్యాబేజీ మొదలైనవి తినాలి. కాల్షియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులైన ప్రో-బయోటిక్ పెరుగు, తక్కువ కొవ్వు పాలు, తక్కువ కొవ్వు క్రీమ్ చీజ్ మొదలైనవి ఆహారంలో చేర్చాలి.
విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు ఉండాలి, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఆకు కూరలు. డెలివరీ విధానం మరియు తల్లి పాలివ్వటానికి విటమిన్ కె చాలా అవసరం. ఐరన్ అవసరం ఎందుకంటే తక్కువ జనన రేటు మరియు అకాల ప్రసవాలను నివారించడానికి ఇది బాధ్యత వహిస్తుంది.
గర్భిణీలకు దానిమ్మపండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. ఎండిన నల్ల ద్రాక్ష పళ్లలో రక్తలో హిమోగ్లోబిన్ ను పెంపొందించడానికి ఎక్కువగా సహాయపడుతుంది. మీ శరీరానికి అవసరైమ నీరు ఉండేందుకు ఎండిన నల్లద్రాక్ష బాగా సాయం చేస్తుంది.
అదే విధంగా, ఆరోగ్యకరమైన బిడ్డను కలిగి ఉండటానికి మంచి డైట్ మెయింటెయిన్ చేస్తూ నీరు ఎక్కువగా తాగుతూ పండ్లు తీసుకోవడం మరిచిపోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.