telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే శరీరంలో మెగ్నీషియం శాతం బాగా లోపించి ఉండవచ్చు. తగినంత మెగ్నీషియం శరీరానికి చాలా శక్తినిస్తుంది. ఇది శరీరంలో సరిపడినంత లేనపుడు కణాల్లో కాల్షియం శాతం పెరుగుతుంది. ఫలితంగా ప్రధానమైన హార్మోన్లు, న్యూట్రోట్రాన్సిమిటర్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కొంత సమయం తర్వాత రక్తనాళాలు బాగా ముడుచుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది.
మెగ్నీషియం పరిమాణం బాగా తక్కువైతే బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది. దానివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామిడిపళ్ళు, తోటకూర, గసగసాలు, ద్రాక్ష, చేపలు, బంగాళాదుంపలు, అన్ని రకాల చిరుధాన్యాలు తప్పకుండా తినాలి. అప్పుడు తలనొప్పికాదు, నిద్రలేమితో బాధపడుతున్నా, ఆ బాధ నుంచి సులభంగా బయటపడుతారు.

#తల_నొప్పి_వెంటనే_తగ్గడానికి సలహాలు
1. ఆముదం ఆకులు తీసి వేడి చేసి తలకు కడితే వెంటనే తల నొప్పి తగుతుంది.
2. నిమ్మరసం తో ఉప్పును, బెల్లముము నూరి తలకు పట్టించిన తలనొప్పి తగ్గును.
3. పుదీనా పువ్వు 10గ్రాములు, వాముపువ్వు 10గ్రాములు, కర్పూరం 20గ్రాములు వాటిని విడివిడిగా ఎండ బెట్టాలి. అప్పుడు అది ద్రావముగా (నీరు గా) మారుతుంది. అందులో 10గ్రాములు సోపు నూనె కల్పవలను. దీనిని కొద్దిగా కొద్దిగా తలకు పూస్తున్న తల నొప్పి తగ్గును.
4. ఆవునెయ్యి, నిమ్మకాయరసం కలిపి తలకు మర్దన చేస్తున్నా కూడా తల నొప్పి తగ్గుతుంది.
5. దానిమ్మ మొగ్గలు 3 తులముల , పతికబెల్లము( కలకండ ) 1 తులాము రెండింటిని కలిపి దంచి గుడ్డలో వేసి పిండగా వచ్చినా రసమును 3-5 చుక్కలు ముక్కులో వేసిన వెంటనే తల నొప్పి త్తగగ్గుతుంది.
6. జాతమంసినిని నీటిలో అరగదీసి వచ్చినా గందమును కనతలకు పట్టించిన్న వెంటనే తల నొప్పి మాయమగును.
7. వేడి వేడి టీ త్రాగితే, అలాగే వేడి నీటిలో కాళ్ళు నునిగే వరకు ఉంచి నీళ్ల లో ఉంచాలీ. అలచేస్తుంటే తలనొప్పి అనేది తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయల ముక్కలను వాసన చూస్తుండలి.
8. సహదేవి చెట్టు వేరు, హారతికర్పూరం, రెండింటిని కలిపి మెత్తగా నూరి కనతలకు పూయుచ్చున్న ఎటువంటి తలనొప్పి అయిన వెంటనే తగ్గది
ఆరోగ్యవంతమైన జీవితానికి మంచి నిద్ర అవసరం ఎంతైనా ఉంటుంది.కానీ,చాలా తక్కువ మంది మాత్రమే చాలినంత నిద్రపోతారు.
నూతన శిశువులకు అంటే మూడు నెలల వయస్సు దాకా రోజుకు 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. నలుగు నుండి పదకొండు మసాలా వరకు 12 నుండి 15 గంటల నిద్ర అవసరం.
ఒకటి నుండి రొండు సంవత్సరాల దాక 11 నుండి 14 గంటల నిద్ర అవసరం.
మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు రోజు 10 నుండి 13 గంటల నిద్ర కావాలి.
స్కూల్ కి వెళ్ళే పిల్లలకి అంటే ఆరు నుండి పదమూడు దాకా రోజుకు 9 నుండి 11 గంటలు నిద్ర అవసరం.
కాలేజ్ కి అంటే 14 నుండి 17 సంవత్సరాల పిల్లలకి 8 నుండి 10 గంటల నిద్ర అవసరం.
18 నుండి 25 సంవత్సరాల వరకు 7 నుండి 9 గంటల నిద్ర అవసరం.
24 నుండి 64 సంవత్సరాలదాకా 7 నుండి 9 గంట నిద్ర కావాలి.
65 సంవత్సరాలు దటినవారికి 7 నుండి 8 గంటల నిద్ర కావాలి.
ఆహారం, వ్యాయామం లాగే మంచి నిద్ర కూడా శరీరానికి,మెదడుకు అవసరం.నిద్ర లేమి వళ్ళ ఆరోగ్యం కలగడం మాత్రమే కాదు,పని ఉత్పాదన శక్తి కూడా తగ్గిపోతుంది.
#పార్శ్వపు_తలనొప్పికి : రాత్రి నిద్రపోయేముందు 60 గ్రాముల కండ చక్కెర పొడి పావులీటరు నీటిలో వేసి కరిగించి మూతపెట్టి పక్కన పెట్టుకొని పడుకోవాలి. తెల్లవారు ఝామున 5 గంటలకు నిద్రలేచి ఆ పంచదార నీళ్ళని ఒకసారి కలుపుకుని తాగాలి. తర్వాత ఒక గంటవరకూ మరేమీ తాగకూడదు, తినకూడదు. ఈవిధంగా నాలుగు నుంచి ఐదు రోజులు చేస్తే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.
#తలరోగాలకు (తలనొప్పి) : రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నువ్వుల నూనె రెండు చుక్కలు చెవులలోనూ రెండుచుక్కలు ముక్కులలోనూ వేయాలి. గుక్కెడు నూనెను నోటిలోనూ వేసుకుని ఐదు నిమిషాలు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల ఈ తైలం తలలోని సర్వ శిరో భాగాలకు చేరి మలిన, వ్యర్ధ పదార్థాలు, మలిన వాయువులు, ఉష్ణ వాయువులు నిలువ వుండకుండా వాటిని కరిగిస్తూ శిరస్సును పరిశుభ్రంగా ఉంచుతుంది. ఖర్చు లేని కష్టం లేని ఈ ఒక్క సులువైన ప్రయోగంతో భవిష్యత్తులో రక్తపోటు, గుండెపోటు, పక్షపాతం, మూర్ఛ, అపస్మారము, కండరాలక్షయం మొదలైన నరాల సంబంధిత రోగాలు దరి చేరకుండా తమను తాము కాపాడుకోవచ్చు.

Related posts