telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిపై బీజేపీ, కాంగ్రెస్ తమ అభిప్రాయం వెల్లడించాలి: పవన్

pawan-kalyan

ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని అన్నారు. రాజధానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించాలని కోరారు.

ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఏపీ రాజధాని వ్యవహారాన్ని చక్కదిద్దాలని పవన్ అభిలషించారు. దీనిపై అఖిలపక్షం వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Related posts