పెళ్లి వేడుకలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. మహబూబ్నగర్లోని దేవరకద్రలో నిన్న సాయంత్రం ఓ వివాహ వేడుకకు మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు.
ఆ తర్వాత చూసుకుంటే మంత్రి చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది.
డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది..