telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ‌లో కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

కరోనా కేసుల విషయంలో ఏపీ సీఎం జగన్ రోజుకో మాట చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖ‌ప‌ట్నంలో కరోనా కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, 1600కి పైగా పెండింగ్ లో ఉన్న టెస్టుల ఫలితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందని అన్నారు. కరోనాకు భయపడాల్సిన పని లేదని, జ్వ‌ర‌మే లాంటిదే కనుక త‌గ్గిపోతుందంటున్న జగన్, తాడేప‌ల్లిలోని తన నివాసం దాటి ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదని ప్రశ్నించారు.

వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు వైఎస్ వార‌సుడిగా జగన్ కు ఉందేమో కానీ, లాక్‌డౌన్‌తో తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడిపోతున్న పేద‌ల‌కు లేదని అన్నారు. దేశంలోనే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ అని జగన్ ప్రకటించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ, ఎక్కువ మ‌ర‌ణాల్లోనూ, త‌క్కువ రిక‌వ‌రీలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీయే నెంబ‌ర్‌వ‌న్ అని అన్నారు.

Related posts