లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్గా శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” చిత్రం చేస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్-శంకర్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి . భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్తో పాటు, రకుల్ ప్రీత్సింగ్, సిద్ధార్థ, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా… కమల్హాసన్పై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. కమల్హాసన్ తనకు ఎప్పటి నుండో రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నారని, చెల్లింపుల విషయంలో ఆయన నుండి రెస్పాన్స్ లేదని ఈ సందర్భంగా జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిలో పేర్కొన్నారు. ఉత్తమవిలన్ రిలీజ్ సమయంలో జ్ఞానవేల్ రాజా నుండి కమల్ హాసన్ ఈ డబ్బు తీసుకున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారట. ఇప్పుడు నిర్మాతల మండలి ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.
previous post
next post