telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ..

 

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు స‌మావేశం అయ్యారు. క‌రోనా క‌ష్ట కాలంలో సినీ పరిశ్రమలో వ‌చ్చిన సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ స‌మ‌స్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు.

Tollywood: మెగాస్టార్ ఇంటికి సినీపెద్దలు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌‌‌తో భేటీ పై సాగిన చర్చ.. సమస్యల పరిష్కారం ప్ర‌ధాన డిమాండ్‌‌‌గా..

ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బి, సి సెంటర్స్ లో టిక్కెట్ ధ‌ర‌లు, విద్యుత్ టారిఫ్, సిని కార్మికులకు, థియేటర్ కార్మికుల, పలు  వంటి సమస్యలపై వారు చర్చించారు. సిని ప్రముఖులను మెగాస్టార్ స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా  అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది.

ఈ భేటీలో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, డి సురేష్ బాబు, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

 

 

Related posts