telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం : … యువ క్రికెటర్ లకు .. గంభీర్ స్కాలర్ షిప్ ..

gambhir fire on selection board on rayudu

భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వర్ధమాన, ఔత్సాహిక క్రికెటర్ల అభివృద్ధికి తన భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఫన్‌గేజ్‌ సంస్థ అందిస్తున్న స్కాలర్‌షిప్‌నకు నగరానికి చెందిన ముగ్గురు క్రికెటర్లు అర్హత సాధించారు. ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్‌జీ పవర్‌ ప్లేయర్స్‌ ఎంపికల్లో ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపిన గుల్ఫాం గుల్జార్‌ సాహే, ధీరజ్‌ లక్ష్మణ్‌, మునీష్‌ వర్మ గౌతమ్‌ గంభీర్‌ను ఆకట్టుకున్నారు. ఆయన నుంచి ఐదేళ్ల స్కాలర్‌షిప్‌ ప్రతిని అందుకున్నారు. అంతేకాకుండా యూకేలోని లీసెస్టర్‌లో మూడు వారాలపాటు జరగనున్న శిక్షణ శిబిరానికి భారత్‌ నుంచి ఎంపికైన 15 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

12 నుంచి 24 ఏళ్లలోపు క్రికెటర్లకు అందించే స్కాలర్‌షిప్‌ కోసం ఈనెల 6వ తేదీన రఘు ఇంజనీరింగ్‌ కాలేజి గ్రౌండ్‌ లో ఎంపికలు నిర్వహించనున్నట్టు ఫన్‌గేజ్‌ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు వివరాలకు ఫోన్‌:7981797919 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Related posts