telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీశైలంలో ప్రబలుతున్న కరోనా..మరో ఐదు రోజులు దర్శనాలు రద్దు!

Srishailam temple

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దర్శనాలకు బ్రేక్ పడింది. సామాన్య భక్తులకు మరో ఐదు రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. స్వామి, అమ్మవార్లకు జరగాల్సిన సేవలన్నీ ఏకాంతంగా జరిపిస్తున్నట్టు ప్రకటించారు. పట్టణంలో వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, ఎక్కడికక్కడ శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు.

తిరుమలకు వస్తున్న భక్తుల రాక మరింతగా మందగించింది. దర్శనాల సంఖ్య రోజుకు 6 వేలు దాటడం లేదు. నిన్న మంగళవారం స్వామిని 5,491 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా 42 లక్షల ఆదాయం లభించిందని తెలిపారు.

Related posts