ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు.
మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు.. యువకులు పాల్గొన్న ర్యాలీ కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా పోలీసుల చేతుల్లోని నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకీని తీసుకుని గాల్లోకి గురి పెట్టి కాల్పులు జరిపారు.
అనంతరం ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. .