telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,384 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,384 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది. అదే సమయంలో 11 కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1851 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఆసుపత్రుల్లో 22,908 మందికి చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మొత్తం 755కు చేరింది. ఇప్పటివరకు 80,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 మందికి కొత్తగా కోవిడ్ నిర్దారణ అయింది.

Related posts