భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో భారీ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ డిసెంబరు 1 నుంచి 5 రోజుల పాటు వివిధ వస్తువులపై రాయితీలు అందిస్తున్నట్లు బుధవారం సంస్థ తన మైక్రో సైట్లో ప్రకటించింది. ఇది ఈ ఏడాది చివర్లో తాము ఇస్తున్న ఫెస్టివల్ సేల్ అని పేర్కొంది. సేల్లో భాగంగా మొబైల్ ఫోన్లు సహా టీవీలు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం వరకూ.. ల్యాప్టాప్లు, కెమెరాలపై 80 శాతం వరకూ రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాక హెచ్డీఎఫ్సీ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్స్టంట్ రాయితీ కల్పిస్తోంది.
ఫ్లిప్కార్ట్ మైక్రోసైట్లో సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. బిగ్ షాపింగ్ డేస్ సేల్ డిసెంబరు 1న ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్ నవంబరు 30 రాత్రి 8 గంటల నుంచే అందుబాటులోకి రానుంది. ఆఫర్లో భాగంగా రియల్మీ 5, రియల్మీ ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9+, గూగుల్ పిక్సల్ 3ఏ, ఐఫోన్ 7, ఆసుస్ 5జడ్ వంటి ఫోన్లపై రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకూ రాయితీలు అందిస్తోంది.