telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పాక్ తో ఆడటంపై .. దేశ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటాం.. కోహ్లీ

kohli on playing with pak in world cup

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం దాదాపు పూర్తిగా ఇండియా-పాక్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనితో ఆదేశంతో అన్ని రకాల సంబంధాలను భారత్ తెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలోనే పాక్ తో క్రికెట్ కూడా నిషేదించాలని ప్రజల వద్ద నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో.. ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. అయితే దీనిపై తాజాగా కోహ్లీ స్పందించారు.

పాక్ తో ఆడే విషయంపై భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని కోహ్లీ చెప్పాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని చెప్పాడు. ప్రస్తుతం తమ దృష్టి ఆస్ట్రేలియా సిరీస్ పైనే ఉందని తెలిపాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.

Related posts