ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని నిజాముద్దీన్లోని ఆమె నివాసానికి తరలించారు. షీలా దీక్షిత్ భౌతిక కాయానికి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళులర్పించారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు షీలా దీక్షిత్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి 3 గంటల తర్వాత నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.