telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల ఉసురు తగిలి కేసీఆర్‌ నాశనమైపోతారు: కోమటిరెడ్డి

Komatireddy comments TRS Elections

తెలంగాణ ఇంటర్ తప్పిదాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. చేతకాని ప్రభుత్వం వల్ల 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 23 మంది ఉసురు తగిలి కేసీఆర్‌ నాశనమైపోతారన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న ఆసక్తి పాలనపై లేదని ధ్వజమెత్తారు.

ఇంటర్ ఫలితాలు సరిగా ప్రకటించలేని కేసీఆర్‌.. పీఎం అవుతారా? అంటూ ఎద్దేవాచేశారు. కమీషన్లు వచ్చే వాటిపైనే కేసీఆర్‌ సమీక్షలు చేస్తారని విమర్శించారు. చెరో రూ.50 లక్షలు తీసుకున్న అశోక్‌, విజేందర్‌రావులు.. గ్లోబరీనాకు టెండర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. అసమర్ధుడు విద్యాశాఖ మంత్రి కావడం మన దురదృష్టమన్నారు.

Related posts