telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడటంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెల‌రేగాయి.

క్ష‌ణాల్లో మంట‌లు అంటుకోవ‌డంతో బీఎఫ్ యూనిట్ మంట‌ల్లో చిక్కుకుపోయింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

బీఎఫ్ యూనిట్‌లోని కీల‌క వ‌స్తువులు మంట‌ల్లో కాలిపోవ‌డంతో సుమారు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా..అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్‌ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.అలాగే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts