హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న ఓ రైల్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్లోని ప్లాట్ఫాం నెంబర్ 6లో నిలిచి ఉన్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు చేలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.