జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి బి.వెంకటనర్సమ్మ కోరారు. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకునే అవకాశం ఉందని, విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విశ్రాంత ఉపాధ్యాయులు ఇందుకు అనర్హులు.
ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయా కేటగిరీల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 15 వరకు వచ్చి న దరఖాస్తులను జిల్లా సెలక్షన్ కమిటీ జూన్ 16 నుంచి జూలై 7 వరకు స్టేట్ సెలక్షన్ కమిటీకి పంపుతుంది. జూలై 8వ తేదీ తర్వాత స్టేట్ సెలక్షన్ కమిటీ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఆన్లైన్ పోర్టల్లో జూలై 22 నాటికి ఇండిపెండెంట్ నేషనల్ జ్యూరీకి పంపిస్తారు. జూలై 25న షార్ట్లిస్ట్ జాబితాలోని వారికి ఎంహెచ్ఆర్డీ సమాచారం ఇస్తుంది. ఆగస్టు 16న ఇండిపెండెంట్ నేషనల్ జ్యూరీ ఫైనల్ జాబితాలోని పేర్లను ప్రకటిస్తారు.