తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్ లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని…మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ,దసరా పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని కెసిఆర్ అన్నారు. కాగా దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
previous post