తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను టాలీవుడ్కు అందించిన ఘనత వీరి సొంతం. అసాధారణ రచనా నైపుణ్యం, శక్తివంతమైన సంభాషణలకు ప్రసిద్ధి చెందారు పరుచూరి బ్రదర్స్.
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేశారు. కొన్ని దశాబ్దాల పాటు సినీరంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ సోదరులు. రచయితలకి స్టార్ హోదా దక్కిందంటే దానికి వీరు ఓ కారణమని చెప్పవచ్చు.
పరుచూరి బ్రదర్స్లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా.. దర్శకుడిగా, నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది.
దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేశారు. “‘నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు శరీరం, వృద్ధాప్యాన్ని చూసి కొంచెం బాధపడ్డాను, కానీ అతని మనస్సు ఇప్పటికీ ఎప్పటిలాగే పదునైనది, అతను, అతని సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ 300 కంటే ఎక్కువ సినిమాలు రాశారు! అచీవ్మెంట్ కాదు! 200 ప్లస్ బ్లాక్బస్టర్స్! లవ్ యూ సర్.” అని తెలిపారు.
ఆ ఫొటోలలో పరుచూరి వెంకటేశ్వరరావుని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన రూపం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.ఈ ఫొటో చూస్తుంటే ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
.