టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంరామవరంలో పుష్కర కాలువను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్లపై కేసు నమోదైంది.
సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎటువంటి పర్మిషన్ లేకుండా వారు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వసం చేశారంటూ పోలీసులు పేర్కొన్నారు. అందుకే భూపతి రాజ్యలక్ష్మి, సంజయ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
కాగా..సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రావణాసుర, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.