ఐపీఎల్ 2021 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్-అక్టోబర్లో యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. గతేడాది సైతం సెప్టెంబర్లోనే యూఏఈలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనాపై ట్విటర్ వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. యూఏఈ వేదికగా జరిగిఐ ఐపీఎల్ 2020 సీజన్కు సురేశ్ రైనా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎస్కే ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్న అతను జట్టుతో దుబాయ్కి కూడా వెళ్లాడు. అక్కడ క్వారంటైన్ పాటిస్తూ అర్దంతరంగా జట్టును వీడి స్వదేశానికి వచ్చాడు. అయితే తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే లీగ్ నుంచి తప్పుకునేలా చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. బాల్కానీ గది విషయంలో సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్తో రైనాకు వాగ్వాదం జరిగినట్లు వార్తలు వినిపించాయి. వీటిని రైనా ఖండించినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే మరోసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో రైనాకు బాల్కానీ రూమ్ కేటాయించడం మరిచిపోవద్దని సీఎస్కేను అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇక రైనా బాల్కానీ రూమ్ విషయంలో నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లు యూఏఈలోనే అని బీసీసీఐ చెప్పగానే… సీఎస్కే రైనా కోసం బాల్కానీ రూమ్ బుక్ చేస్తుందని, కర్చీఫ్ కూడా వేసిందనే కామెంట్స్తో మీమ్స్ షేర్ చేస్తున్నారు.
previous post