telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఈఎస్ఐ మందుల స్కాంలో మరో ఇద్దరు అరెస్టు

esi hospital hyderabad

ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ విశాల్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన పందిరి భూపాల్ రెడ్డి, వసుధ మార్కెటింగ్ ఏజెన్సీకి చెందిన నాగేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి, తేజా ఫార్మా కంపెనీ వర్గాలతో కుమ్మక్కైనట్టు గుర్తించారు. 

ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బినామి కంపెనీలకు నిందితులు సహకరించారు.షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐఎంఎస్ నుంచి నకిలీ బిల్లులను క్లెయిమ్ చేసుకున్నట్టు తెలుసుకున్నారు.

Related posts