telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళలు ప్రతి పనిలో ముందుంటున్నారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha indrareddy

మహిళలు ప్రతి పనిలో ముందుంటున్నారని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ బోడుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మహిళలు రాజకీయంగా ఎదగాలని అన్నారు. అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. మొన్నజరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 60 శాతం మహిళలకు అవకాశం కల్పించారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలకు కష్టపడొద్దని ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువశాతం మహిళలే పోటీచేస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మహిళలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

Related posts