telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అశ్విన్ దెబ్బకు… ఇంగ్లండ్ ఆలౌట్..

చెన్నై లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ ఆల్ ఔట్ అయ్యింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులు చేసి ఆల్ ఔట్ కాగా భారత్ 337 పరుగులకే కుప్ప కూలిపోయింది. అయితే.. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పట్టుబిగిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీం ఇండియా బౌలింగ్‌ లో అదరగొట్టింది. అశ్విన్‌ దెబ్బకు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటైంది. అలౌటైన ఇంగ్లండ్‌.. 420 పరుగుల భారీ లక్ష్యాన్ని టీం ఇండియా ముందు పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 241 పరుగలు ఆధిక్యం సంపాదించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడటానికి ప్రయత్నించి ఇంగ్లండ్‌ ప్లేయర్లు వికెట్లు పారేసుకున్నారు. టీం ఇండియా బౌలర్లలో అశ్విన్‌ 6 వికెట్లు తీయటం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కెప్టెన్‌ రూట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Related posts