telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనా ఎఫెక్ట్.. 51 ఏళ్ల వయసులో టెన్త్ పాస్!

Corona

కరోనా ప్రభావంతో పది పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం అందరినీ పాస్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని భోలక్ పూర్ అంజుమన్ బాలుర హైస్కూల్ లో వాచ్ మన్ గా పనిచేసే మహ్మద్ నూరుద్దీన్ 51 ఏళ్ల వయసులో టెన్త్ పాస్ అయ్యాడు. ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా పాస్ కాలేదు కానీ, కరోనా పుణ్యమా అని ఎట్టకేలకు గట్టెక్కాడు.

నూరుద్దీన్ తొలిసారిగా 1987లో ప్రైవేట్ గా టెన్త్ పరీక్షలు రాశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ అపజయమే.ఇటీవలే టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు కట్టాడు. కరోనా చలవతో పరీక్షలేమీ లేకపోవడంతో అందరిలాగే నూరుద్దీన్ ను కూడా పాస్ చేశారు. నూరుద్దీన్ కు ఇంటర్ చదివిన ఇద్దరు కుమారులతో పాటు బీకాం ఉత్తీర్ణురాలైన ఓ కుమార్తె కూడా ఉంది.

Related posts