telugu navyamedia
వార్తలు సామాజిక

మాస్కుల కంపెనీపై కరోనా పంజా..70 మందికి సోకిన వైరస్

masks

దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కుల కంపెనీలు పెద్దమొత్తంలో మాస్కులను తయారు చేస్తున్నాయి. పుదుచ్చేరిలో మాస్కులను తయారు చేస్తున్న కంపెనీపై కరోనా పంజా విసిరింది.

కంపెనీలో పని చేస్తున్న 70 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ ఘటనపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడ్డారు. ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో సదరు కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Related posts