telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నంపెట్టే రైతన్న సర్వం కోల్పోయి కన్నీరుపెడుతుంటే..జగన్‌ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.

లాక్ డౌన్ ఒకపక్క, అకాల వర్షాలు మరోపక్క రాష్ట్ర రైతాంగాన్ని కోలుకోలేని తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో మార్కెట్లో తమ పంటల ఉత్పత్తులను అమ్ముకోలేక రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని ట్విట్టర్‌లో ఈ పోస్టులు చేశారు.

Related posts