telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది

గ్రామ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం సంతోషంగా ఉందని… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాక ముందు మన రైతన్నల పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచన చేయాలని వెల్లడించారు. కరెంట్ ఒకప్పుడు సరిగా లేక అనేక ఇబ్బందులు పడేవారు…కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత కరెంట్ లేదన్నారు. ఒక్క తెలంగాణలో తప్ప రైతుబీమా ఏ రాష్ట్రంలో లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని.. ఈ విషయాన్ని సాక్షాత్తు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చెప్పిందని పేర్కొన్నారు. హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం ద్వారా తెలంగాణ గ్రామీణ జీవన విధానం బాగుపడబోతోందన్నారు. గ్రామ స్థాయిలో పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

Related posts