జలవనరుల శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి భార్య శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తించడం చర్చనీయాంశంగా మారింది. ఎగువున కురుస్తున్న భారీ వర్షా ల కారణంగా జూరాల, సుంకేసుల రిజర్వాయర్ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో కి భారీగా వదర నీరు చేరుతోంది. సోమవారం దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద డ్యాంకు చేరడంతో తొలుత సాయంత్రం 4 ఆ తర్వాత రాత్రికి మరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా అధికారుల తీరు విమర్శలకు దారితీసింది. వాస్తవానికి గేట్లు ఎత్తే విధులను అధికారులు నిర్వర్తించాలి. కానీ భర్త వంతుకు భార్య విధులను నిర్వహించింది. జలవనరుల శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) శ్రీనివాసరెడ్డి తన భార్యతో గేట్లు ఎత్తించడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.