తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ..ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న తమకు పజ్జన్నా అండగా నిలిచారన్నారు. ఆ సమయంలో తమకు తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. 2012లో తన పెళ్లి చేసింది పద్మారావు అన్ననే అని తెలిపారు.
తన అత్తమామ పెళ్లికి ఒప్పుకోకపోతే.. పద్మారావు అన్న పెద్దమనసుతో మూడు నెలల కాలంలో రెండు విడుతలుగా వారితో మాట్లాడి తమ ప్రేమ వివాహానికి ఒప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత దగ్గరుండి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పద్మారావు డిప్యూటీ స్పీకర్ కావడం సంతోషంగా ఉందన్నారు.
భూదందా కోసమే రాజధాని మార్పు: కన్నా