కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అస్వస్థతకు గురవ్వడంతో అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు. అమిత్ షాకు చికిత్సలో భాగంగా పరీక్షించిన వైద్యులు.. మెడ వెనుక భాగంలో లింపోమా(చిన్న గడ్డ)కు మైనర్ సర్జరీ నిర్వహించారు.
స్థానిక అనెస్థీషియా ఇచ్చి, ఈ ఆపరేషన్ ను వైద్యులు పూర్తి చేశారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం అమిత్ షాను డిశ్చార్జ్ చేయడంతో ఆయన గాంధీనగర్ లోని తన నివాసానికి వెళ్లారు. కాగా, వ్యక్తిగత పర్యటన నిమ్మిత్తం మంగళవారం రాత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్కు వచ్చారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.