telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ బడ్జెట్ 2020-21..ఆరోగ్య శాఖకు 11 కోట్లు

buggana Rajendraprasad

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు.

పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని చెప్పారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

రెవెన్యూ వ్యయం – రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం – రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 26,646.92 కోట్లు

 పథకాలకు కేటాయింపుల వివరాలు:

ఆరోగ్య శాఖకు – 11,419.44 కోట్లు
వ్యవసాయ రంగానికి – రూ. 11,891 కోట్లు
పంటల ఉచిత బీమా పథకానికి – రూ. 500 కోట్లు
రైతు భరోసా-పీఎం కిసాన్ – రూ. 3,615.60 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం – రూ. 1,100 కోట్లు
104, 108 పథకాలకు – రూ. 470.29 కోట్లు
జగనన్న విద్యా దీవెనకు – రూ. 2,277 కోట్లు
ప్రాథమిక, ఇంటర్ విద్యకు – రూ. 22,604 కోట్లు

హోం శాఖకు – రూ. 5,988.72 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి – రూ. 1,279.78 కోట్లు
ఐటీ రంగానికి – రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి – రూ. 601.37 కోట్లు
జలవనరుల శాఖకు – రూ. 11,805.74 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి – రూ. 16,710.34 కోట్లు

Related posts