telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు రోజులు మండలి సమావేశాలు: బీఏసీ

ap legislative council

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు.

ఒకవేళ మండలి సమావేశాల్లో సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts