లాక్ డౌన్ లో కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో ఆయా సంస్థలు తెరచుకుంటున్నాయి. ఇందులో భాంగా అనంతపురం కియా పరిశ్రమలో ఎట్టకేలకు కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 7 నుంచి, ఏడు వందల మందితో ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. లాక్ డౌన్ అనంతరం మార్చి 25వ తేదీన ఈ సంస్థ మూతపడింది. దాదాపు 42 రోజుల పాటు కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు భావించారు. తిరిగి పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.