telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ధారవిలో అంతమైన కరోనా…

corona vaccine India

మన దేశంలోనే కాదు ఆసియాలో అతిపెద్ద మురికివాడగా ముంబైలోని ధారవికి పేరుంది. అయితే, మహారాష్ట్రలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని తరహాలో కేసులు నమోదు అవుతూ వచ్చాయి… వీటిలో ధారవి ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి మొట్టమొదటిసారి ఇక్కడ ఇవాళ ఒక్క కొత్త పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఒక్కప్పుడు కరోనా విలయతాండవం చేసిన ప్రాంతంలో… ఇప్పుడు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారులు… ధారవిలో కరోనా కట్టడి కోసం.. ఆరోగ్య కార్యకర్తలు, పరిశోధన ఔత్సాహికులు కీలకపాత్ర పోషించారు. ఇంటింటికీ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి వైరస్‌ బారినపడిన వారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. ఇలా అంతా కలసికట్టుగా పనిచేయడంతో.. ఇక్కడ కరోనాకు చెక్ పెట్టామని చెబుతున్నారు. కాగా, జూలై 26న ఇక్కడ కేవలం రెండు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తరువాత నెలరోజుల్లోనే వైరస్‌ ఉధృతి పెరిగింది. అయితే, డిసెంబర్‌ చివరినాటికి క్రమంగా తగ్గుతూ వచ్చింది.

Related posts