telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీఎంసీకి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి 11 మంది ఎమ్మెల్యేలు..!

mamatha benerji

బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్‌పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్‌కు చెక్‌ పెట్టె దిశగా అడుగులేస్తోంది. తాజాగా.. మమత భేనర్జీకి ఊహించని షాక్‌ ఇచ్చింది బీజేపీ. ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి… తాను పోవడమే గాక తనతోపాటు మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లాడు. సువేందు వెంట మహా అయితే.. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వెళతారని టీఎంసీ ముందుగానే ఊహించింది. అయితే.. వారి అంచనాలకు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది టీఎంసీని వీడి… బీజేపీ పార్టీకి వెళ్లారు. ఇవాళ బీజేపీలో చేరిన బెంగాళ్‌ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మొండల్‌, అశోక్‌ దిండా, సుదీప్‌ ముఖర్జీ, సైకత్‌ పంజా, షి భద్ర దత్త, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, బనశ్రీ మైతీ ఉన్నారు. వారితో పాటు పర్బ బుర్ద్యాన్‌ నియోజక వర్గ ఎంపీ సునీల్‌ మొండల్‌, మాజీ ఎంపీ దశరథ్‌ టిర్కీ కూడా అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు.

Related posts