telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్ర బాబుకు దుర్గమ్మ ఆశీస్సులు.

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారు శుక్రవారం రోజు శ్రీమతి భువనేశ్వరితో కలసి తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు . ఈరోజు శ్రీమతి భువనేశ్వరి , తెలుగు దేశం నాయకులతో కలసి విజయవాడలోని కనక దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు .
చంద్ర బాబు ను చూడటానికి కొండమీద భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు . అలాగే చంద్ర బాబు నాయుడు దుర్గమ్మను దర్శించడానికి వస్తున్నారని తెలిసి మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు .
జైలు నుంచి వచ్చిన తరువాత పూర్తిగా విశంతి తీలుకున్నాని , నిన్న శ్రీవారిని దర్శించుకుని వారి ఆశిస్సులు తీసుకున్నానని , ఈరోజు అమ్మ కోసం వచ్చానని చంద్ర బాబు మీడియా కు తెలిపారు .

Related posts