అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైట్ హౌస్లో ఆయన మాట్లాడుతూ… తానంటే ఎవరికీ ఇష్టం లేదని అన్నారు. తమ దేశ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కంటే తనను ప్రజలు తక్కువగా ఇష్టపడుతున్నారని అన్నారు. తనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో తెలియట్లేదని చెప్పుకొచ్చారు.
ఫౌచీని తమ సర్కారే నియమించిందని అన్నారు. ఆయన ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. అమెరికాలో కరోనా కట్టడి కోసం ఫౌచీతో పాటు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సూచనలనే తమ సర్కారు అమలు చేసిందని చెప్పారు. అయితే, ఈ విషయంలో తనకే అధికంగా మద్దతు రావాల్సి ఉందని అందుకు భిన్నంగా ఫౌచీకి వస్తోందని వ్యాఖ్యానించారు.
ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల