telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మైనార్టీల హక్కులు పూర్తిగా అణచివేస్తున్నారు: రఘువీరా

AP Congress Manifesto released

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దళితులు, మైనార్టీల హక్కులు పూర్తిగా అణచి వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయని చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని, బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీల్లో సామాజిక స్పృహలేదని, ఈ రెండు పార్టీల్లో బలహీన వర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని తెలిపారు. బీజేపీ బలహీన వర్గాలపై కక్షకట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Related posts