telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా విలయతాండవం..ఒక్కరోజే 10వేల కేసులు

Corona

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ రోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10,093 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది.

ఈరోజు 2,784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 55,406 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 18,20,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

బుధవారం ఒక్క రోజే 65 మందిని కొవిడ్ వల్ల మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

Related posts