మహారాష్ట్రను మహమ్మారి కరోనా వణికిస్తోంది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలోనే మొత్తం 235 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనే కేసుల సంఖ్య 3 వేలు దాటింది. తాజాగా ప్రముఖ హీరోలు నివాసం ఉంటున్న ఓ కాంప్లెక్స్లో కరోనా కలకలం రేపింది. ముంబైలోని అంధేరిలోని ఓ భవనంలో కరోనా కేసు నమోదైనట్లు సమాచారం. ఈ భవనంలో పలువురు బాలీవుడ్ తారలు ఉన్నారు. ముంబై అంధేరిలోని ఒక కాంప్లెక్స్లో 11 ఏళ్ల చిన్నారిని కరోనా పాజిటివ్గా గుర్తించిన నేపథ్యంలో కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సి-వింగ్ ఆఫ్ కాంప్లెక్స్లో నివసిస్తున్న దర్శకుడి కుమార్తెకు కరోనా సోకింది. దీంతో ఈ కాంప్లెక్స్ను శుభ్రపరచాలని ఆయన బిఎంసిని కోరారు.ఈ కాంప్లెక్స్లో నివసిస్తున్నవారు గృహ నిర్బంధంలో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. కాగా ఈ భవనంలో బాలీవుడ్ హీరోలు రాజ్కుమార్ రావు, విక్కీ కౌశల్ లు కూడా ఉన్నారు.
previous post