telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరూ ఇళ్లల్లో ఉంటే ‘మిర్చీ’ భామ మాత్రం తన భర్తతో కలిసి…

richa

కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. రోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఇలాంటి టైంలోనూ ‘మిర్చీ’ భామ రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి పిక్నిక్‌కి వెళ్లింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ ద్వారా తెలిపింది. గతేడాది అమెరికాకి చెందిన జో లాంగెల్లాను పెళ్లి చేసుకున్న రిచా ‘కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ ఉన్నాం. నిజానికి కొన్ని వారాల పాటు ఇంట్లో ఉంటూ దూరంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామాగ్రిని కొనుగోలు చేయడానికి మాత్రమే వచ్చేవాళ్లం. తాజాగా తామిద్దరం సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ ఒరెగాన్ నదికి వెళ్లినట్లు’ రిచా భర్త జో ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. మళ్లీ అదే విషయాన్ని రిచా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

Related posts