telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మంత్రివర్గం .. కూర్పు ఇలా..8 మంది బీసీలు..

high grade offices transfers in AP

ఏపీసీఎం జగన్ కొత్త మంత్రి వర్గం కూర్పు పూర్తిచేశారు. మంత్రి వర్గంలో ఒక ముస్లిం సహా ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులు, నలుగురు రెడ్డి కులస్థులకు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు స్థానం దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటి స్పీకర్ పదవి వరించింది.

మంత్రి వర్గంలో బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పుష్పశ్రీ వాణి, సుచరిత, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణలకు చోటు దక్కింది. రేపు మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉంది. అలాగే 12న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఏపీసీఎం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు.

Related posts