telugu navyamedia
వార్తలు సామాజిక

ఢిల్లీ స్కూళ్లో విద్యార్థుల‌కు కరోనా ప‌రీక్ష‌లు

symptoms of karona virus fear in citizens

ఇటీవ‌ల ఇట‌లీ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్కూళ్లో విద్యార్థుల‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వహించారు. నోయిడా సెక్టార్‌లోని శ్రీరామ్ మిలీనియం స్కూల్‌లోని 40 మంది పిల్ల‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

స్కూల్‌ను రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తుది ప‌రీక్ష‌లను కూడా కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. అయితే ఆ వ్య‌క్తికి సంబంధించిన కుమారుడు శ్రీరామ్ మిలీనియం స్కూల్‌లో చ‌దువుతున్నాడు. 40 మంది విద్యార్థుల‌ను 28 రోజుల పాటు ఐసోలేష‌న్‌కు పంపుతున్న‌ట్లు చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ అనురాగ్ భార్గ‌వ‌ తెలిపారు. స్కూల్‌ పరిసరాలను శుభ్రం చేయనున్నట్టు తెలిపారు.

Related posts